బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలి

– రైతుబంధు మండల అధ్యక్షులు కేబీ రాజు
కుల్కచర్ల, జూలై 18(జనం సాక్షి):
ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా మొక్కలు నాటి సంరక్షించాలని రైతుబంధు మండల అధ్యక్షులు కేబీ రాజు అన్నారు. సోమవారం కుల్కచర్ల మండలం పరిధిలోని పీరంపల్లి గ్రామంలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ..హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. మొక్కలను విరివిరిగా నాటి పర్యావరణాన్ని కాపాడుదాం అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాధిక సోమలింగం, పంచాయతీ కార్యదర్శి సంజీవ్, టెక్నికల్ అసిస్టెంట్ నరేష్, గ్రామస్తులు గడ్డం వెంకటయ్య, మొగులయ్య, మహిళలు తదితరులు పాల్గొన్నారు.