బాబుకు ఓటమి భయం పట్టుకుంది: కన్నా

విజయవాడ,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): సీఎం చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అబద్ధాలు, అసత్యాలు చెబుతూ శ్వేతపత్రాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం సాయం చేయడంలేదని ఆరోపించడం అన్యాయమని, కడప స్టీల్‌ప్లాంట్‌ విషయంలో కేంద్రంపై బురదజల్లుతున్నారని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రతి చర్య, ప్రతి మాట మోసమేనని విమర్శించారు. ఏపీలో హైకోర్టు ఏర్పాటుతో జగన్‌కు ఏ విధంగా లబ్ది చేకూరుతుందో చంద్రబాబు చెప్పాలని కన్నా ప్రశ్నించారు.