బాబును చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతుంది
– వైసీపీ అధికార ప్రతినిధి పేర్ని నాని
విజయవాడ, జనవరి18(జనంసాక్షి) : గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే దేశంలో ఇంత పచ్చి అవకాశవాది ఎవరూ ఉండరనే విషయం మనకు తెలుస్తోందని వైసీపీ అధికార ప్రతినిధి పేర్ని నాని విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ఊసరవెల్లిలా రంగులు మార్చే పేటెంట్ కూడా చంద్రబాబుకే వచ్చిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు విూరు ఏది చెప్తే అది చేయడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరని, ¬దా వద్దు అనే కోదండరామ్తో చంద్రబాబు సావాసం చేస్తున్నారని విమర్శించారు. పాలార్ డ్యామ్ వద్దు అనే స్టాలిన్ ఇంటికి వెళ్లి చంద్రబాబు స్నేహం చేస్తారని, పోలవరానికి అడ్డు చెప్తున్న నవీన్ పట్నాయక్తో బాబు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతారని విమర్శించారు. చంద్రబాబుకు నిలువెల్లా విషంఅని నాని మండిపడ్డారు. మరొకవైపు ఏపీ మంత్రి దేవినేని ఉమాపై కూడా నాని ధ్వజమెత్తారు. దోచుకున్న డబ్బుతో ఉమ నాలుక తిరగడం లేదని, ఆయన నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిది మొదటి నుంచి ఒకే స్టాండ్ అని, ప్రత్యేక ¬దా గురించి కేసీఆర్, కేటీఆర్తో చెప్పించిన ఘనత జగన్దేనన్నారు. చంద్రబాబులా జగన్ ఎప్పుడూ దివాలాకోరు రాజకీయాలు చేయరన్నారు. టీడీపీ కపట నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని ప్రజలు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.