బాబును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు
– తన తప్పను కప్పిపుచుకొనేందుకు ఎదుటివారిపై అబాండాలా?
– వైసీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి
నెల్లూరు, డిసెంబర్29(జనంసాక్షి): తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. శనివారం నెల్లూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. డిసెంబర్ 31లోగా హైకోర్టు భవనాలు సిద్ధం చేస్తామని గతంలో చంద్రబాబు అఫడవిట్ ఇచ్చారని, దానికి అనుగుణంగా హైకోర్టును విభజిస్తే అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో అఫడవిట్ ఇచ్చి ఇప్పుడు తగిన సమయం ఇవ్వలేదని అనడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు రెండు రకాల మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు. ఏపీ హైకోర్టు విభజన జరిగితే చంద్రబాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. హైకోర్టు విభజనకు, ప్రతిపక్షానికి ఏమైనా సంబంధం ఉందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు, కాంగ్రెస్తో కుమ్మకై జగన్పై తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. డిసెంబర్ 15లోగా హైకోర్టు భవనం సిద్ధం చేస్తామని సుప్రీంకోర్టుకు చెప్పిన చంద్రబాబు ఆవిధంగా మాట నిలబెట్టుకోలేకపోయ్యారని మండిపడ్డారు. తనపై కేసులను విచారణకు రాకుండా ముందస్తు తెచ్చుకోవటం చంద్రబాబు అలవాటని, అక్రమంగా పెట్టిన కేసులకు కూడా జగన్ ప్రతీవారం కోర్టుకు హాజరవుతున్నారని అన్నారు. న్యాయస్థానాలపై జగన్ ఉన్న అదని అన్నారు. హైకోర్టు విభజన జగన్ను కేసుల నుండి తప్పించటం కోసం అంటూ చంద్రబాబు జగన్పై అబాండాలు వేసే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైన చంద్రబాబు జగన్పై దుష్పచ్రారాలు మాని, పాలన సరిగా సాగించేలా చూడాలని హితవు పలికారు.