బాబు మాటవిూద నిలబడగలరా: మధు అనుమానం

కాకినాడ,నవంబర్‌19(జ‌నంసాక్షి): కాకినాడలోని సిపిఎం జిల్లా కార్యాలయం సుందరయ్య భవన్‌లో సోమవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ.. బిజెపి కి వ్యతిరేకంగా చంద్రబాబు మాట్లాడడం మంచిదే కానీ ఆయన మాట విూద నిలబడతారనే నమ్మకం లేదని పేర్కొన్నారు. కాకినాడ సెజ్‌ రైతులకు సిఎం ఇచ్చిన మాట తప్పారని చెప్పారు. రైతాంగం తమ భూముల కోసం పోరాడుతుంటే తప్పుడు కేసులతో వారిని వేధించడం తగదని దుయ్యబట్టారు. రైతు నేత సుబ్బిరెడ్డి కి బేడీలు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.