*బాలబ్రాహ్మమేశ్వర స్వామిఆలయాలలో మంద జగన్నాధం ప్రత్యేక పూజలు*

అలంపూర్ జనంసాక్షి (సెప్టెంబర్ 26) శక్తి పీఠాలలో ఒకటైన అలంపూర్ లోని 5వ శక్తి పీఠం జోగులాంబ  బాలబ్రాహ్మమేశ్వర స్వామి ఆలయలను సోమవారం టిఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో అధికార ప్రతినిధి డాక్టర్ మంద జగన్నాథం జోగులాంబ ఆలయాలను  దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి, కార్యనిర్వాహణాధికారి పురేందర్, ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ మంద జగన్నాథం కు స్వాగతం పలికారు. అనంతరం ఉభయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంద జగన్నాథం మాట్లాడుతూ  దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా,అన్ని వసతులు కల్పించాలని, ఆయన అన్నారు.దసరా  ఆంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమంలో
ఆలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి  , ఆలయ ఈవో , తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘ ప్రధాన కార్యదర్శి ఆత్మలింగ రెడ్డి ,మహేష్ గౌడ్ , మాజీ టెంపుల్ చైర్మన్ రవి గౌడ్ , రాములు ,ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు , రాధాకృష్ణ  , రఘు  తదితరులు పాల్గొన్నారు.