బాలికలు విద్యకు దూరం కావద్దు

– కేజీబీవీ ఎస్ఓ దేవి కిషన్
– కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో దుస్తుల పంపిణీ
కుల్కచర్ల, జులై 23 (జనం సాక్షి):
బాలికలు విద్యకు దూరం కావద్దని కేజీబీవీ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ దేవి కిషన్ అన్నారు.శనివారం కుల్కచర్ల మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..బాలికలు చిన్నతనంలోనే బాల్య వివాహాలు చేసుకోవడం చట్టరీత్యా నేరమన్నారు. సమాజంలో బాల బాలికలను సమానంగా చూడాలన్నారు. బాలికలకు ఏమైనా ఇబ్బంది కలిగితే వారి రక్షణ కోసం ప్రభుత్వం షీ టీంలను ఏర్పాటు చేసిందన్నారు.ఏ సమస్య వచ్చినా 1098, 100కు సమాచారం ఇస్తే వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటారని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అమృతమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.
Attachments area