బాలికల పాఠశాలలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన సర్పంచ్, ఎంపీటీసీ

కుల్కచర్ల, జులై 21 (జనం సాక్షి):
కుల్కచర్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం ఉచితంగా అందించిన పాఠ్యపుస్తకలను గురువారం గ్రామ సర్పంచ్ సౌమ్యా వెంకట్ రామ్ రెడ్డి, స్థానిక ఎంపీటీసీ సీహెచ్ ఆనందం, ఎస్ఎంసీ చైర్మన్ బురకొండ నర్సమ్మ విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియం చేసుకొని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య, ఉపాధ్యాయులు చందర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.