బిఆరెఎస్ పార్టీ ఆత్మీయ సమ్మెళన ఏర్పాట్లను పరిశీలిస్తున్న వైస్ ఎంపిపి మల్లేశం

దోమ జనవరి 11(జనం సాక్షి) 
దోమ మండలం కేంద్రంలో ఈనెల 13వ తేదీ నాడు జరిగే బిఆరెఎస్ పార్టీ ఆత్మీయ సమ్మెళనంకు ముమ్మరంగా ఏర్పాట్లు  జరుగుతున్నాయని వైస్ ఎంపిపి మల్లేశం  తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మెళనంకు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి,రాష్ట్ర నాయకులు కొప్పుల అనిల్ రెడ్డి, జడ్పీటీసీ నాగిరెడ్డి,ఎంపిపి,వైస్ ఎంపిపి,పిఏసీఏస్ చెర్మన్, రైతు సమితి అధ్యక్షులు, కో అప్షన్ సభ్యులు, మండల సర్పంచులు,ఎంపిటిసిలు హాజరువుతున్నారు.కావున మండల ప్రజలు, పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు, యువనాయకులు హాజరై ఆత్మీయ సమ్మెళనంను విజయవంతం చేయాలనీ కోరారు.ఈ కార్యక్రమ ఏర్పాట్లలో పార్టీ మండల అద్యక్షుడు గోపాల్ గౌడ్. కో అప్షన్ సభ్యులు ఖాజాపాష, మార్కెట్ కమిటీ డైరెక్టర్ డప్పు శేఖర్, వార్డ్ సభ్యులు డప్పు రమేష్, మైను, బండి సాయిలు, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, చోటు, శ్రవణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.