బి ఆర్ ఎస్ పార్టీ నాయకుడు మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

బి ఆర్ ఎస్ పార్టీ నాయకుడు మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 27 జనం సాక్షి.
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బుధవారంబిఆర్ఎస్ పార్టీ నాయకుడు కె.బీచుపల్లి మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్,మున్సిపల్ కౌన్సిలర్లు.
గద్వాల పట్టణంలోని 2వ వార్డుకు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు కుమ్మరి బీచుపల్లి అనారోగ్యం కారణంగా ప్రభుత్వం ఏరియా హాస్పిటల్ గత కొన్ని రోజులగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. వారి ఆకస్మిక మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ మంచి నాయకుడిని కోల్పోవడం దురదృష్టకరమని గద్వాల మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్, వైస్ చైర్మన్ బాబర్, మున్సిపల్ కౌన్సిలర్లు అన్నారు. బిఆర్ఎస్ పార్టీకి ఆయన మృతి తీరని లోటు అని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.