బీఎస్పీ వాకౌట్‌: యూపీఏకు వూరట

ఢిల్లీ: లోక్‌సభ నుంచి బహుజనసమూజ్‌ పార్టీ వాకౌట్‌ చేసింది. చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల  అంశంపై నిన్న మధ్యాహ్నం నుంచీ సభలో చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఇంకా సేపట్లో ఈ అంశంపై ఓటింగ్‌ జరగనుండగా బీఎస్పీ వాకౌట్‌ చేయడం యూపీఏకీ వూరట కలిగించే అంశం. లోక్‌సభలో బీఎస్పీకి 21 మంది సభ్యులున్నారు. ఎఫ్‌డీఐల బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇప్పటివరకు తమ అభిప్రాయం చెప్పకుండా సస్పెన్స్‌లో ఉంచిన సంగతి తెలిసిందే.