బీబీసీకి తాఖీదులు

9

డాక్యుమెంటరీ ప్రసారంపై రాజ్‌నాథ్‌ ఆగ్రహం

న్యూఢిల్లీ,మార్చి5(జనంసాక్షి): నిర్భయ  గ్యాంగ్‌ రేప్‌ కు సంబంధించి వివాదాస్పద డాక్యుమెంటరీ ‘ఇండియాస్‌ డాటర్‌’ను బీబీసీ ప్రసారం చేయడంతో భారత ప్రభుత్వం ఆ సంస్థకు నోటీసులు అందజేసింది. ఆ సంస్థ ఎలాంటి బెరుకు లేకుండా లండన్‌లో డాక్యుమెంటరీని ప్రసారం చేసి భారత ప్రభుత్వ హెచ్చరికలను పక్కకు పెట్టింది.  పైగా ఆ వీడియోను యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్‌ చేసింది. కాగా బీబీసీ భారత్‌లో మాత్రం ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేయబోమని వెల్లడించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది.  బీబీసీకి లీగల్‌ నోటీసులు పంపింది. ఒప్పందానికి విరుద్ధంగా ఆ డాక్యుమెంటరీని వ్యాపార అవసరాలకు వాడుకున్నందున చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సిందిగా నోటీసులో స్పష్టంచేసింది.

”డాక్యుమెంటరీని వ్యాపార అవసరాలకు వాడుకునేందుకు ముందు బీబీసీ ఎలాంటి అనుమతి తీసుకోలేదు. అందుకే నోటీసు ఇచ్చాం. స్పందన కోసం ఎదురుచూస్తున్నాం” అని ¬ంశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మహిళ దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీన ఆ వీడియోను ప్రసారం చేయడానికి బీబీసీ ప్రణాళిక రచించింది. అయితే   ముందుగానే మార్చి నాల్గో తేదీనే ఆ డాక్యుమెంటరీ ప్రసారం చేయడం ఆశ్చర్యాన్ని కల్గించిందని ¬ం శాఖ తెలిపింది. దీనిలో భాగంగానే ఆ సంస్థకు నోటీసులు పంపినట్లు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా యూ ట్యూబ్‌ లో పెట్టిన ఆ వివాదస్పద వీడియోను తొలగించారు.