బీహార్‌లో ఆర్జెడికి కోలుకోలేని దెబ్బ


29 స్థానాల్లో ఎన్‌డిఎ కూటమికి అవకాశాలు
దేశ రాజకీయాలను గమనిస్తున్న నితీశ్‌
పాట్నా,జూన్‌4 (జనంసాక్షి) : బీహార్‌లో ఆర్జేడీకి కోలుకోలేని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాల్లో అత్యధిక స్థానాల్లో ఎన్డీఏ కూటమి దూసుకుపోతున్నది. సీఎం నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ 13 సీట్లలో లీడ్‌లో ఉండగా, బీజేపీ 11 చోట్ల, లోక్‌జనశక్తి 5 చోట్ల తిరుగులేని ఆధిక్యంలో దూసుకుపోతున్నాయి. ఇక ఇండియా కూటమిలోని ఆర్జేడీ 4, సీపీఐఎంఎల్‌ 2, సీపీఐ, కాంగ్రెస్‌, హెఏఎంఎస్‌ ఒక్కో చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇతరులు 2 సీట్లలో లీడ్‌లో ఉన్నారు.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ కుమార్తె విూసా భారతి పాటలీపుత్రలో బీజేపీపై 6,665 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక సరన్‌లో పోటీచేస్తున్న లాలూ చిన్న కుమార్తె రోహిణి ఆచార్యపై బీజేపీ అభ్యర్థి 998 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. ఈ క్రమంలో దేశ రాజకీయాలు మారుతున్నాయి. ఇప్పుడు అంతా మోడీకి వ్యతిరేకంగా జట్టు కట్టే ఛాన్స్‌ కోసం చూస్తున్నారు. యూ`టర్న్‌ రారాజు’గా పేరొందిన బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మరోసారి యూ`టర్న్‌ తీసుకోబోతున్నారా? సార్వత్రిక ఎన్నికల ముంగిట ఇండియా కూటమిని వీడి ఎన్డీఏలో చేరిన ఆయన.. ఇప్పుడు తిరిగి ఇండియా కూటమిలోకి వెళ్లబోతున్నారా? ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి చూస్తే.. ఆ ప్రశ్నకు అవుననే సమాధానాలే రాజకీయ విశ్లేషకుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్నాయి. అఫ్‌కోర్స్‌.. ఎన్నికల కౌంటింగ్‌లో ఎన్డీఏ మ్యాజిక్‌ ఫిగర్‌ని దాటేసిన మాట వాస్తవమే. కానీ.. ఇండియా కూటమికి వచ్చిన స్థానాలు మాత్రం ఎవ్వరూ ఊహించనివి. ఎన్నికల ముందు బీజేపీ హవా ఎక్కువగా ఉండటం చూసి.. ఇండియా కూటమికి కనీసం 150 స్థానాలు కూడా రాకపోవచ్చని అందరూ అంచనా వేశారు. ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా అవే లెక్కలు చెప్పాయి. ఈసారి ఎన్డీఏ 350కి పైగా స్థానాలతో భారీ విజయం సాధిస్తుందని, ఇండియా కూటమి 150 స్థానాల్లోపే పరిమితం కావొచ్చని ఎగ్జిట్‌ పోల్స్‌ తెలిపాయి. కానీ.. ఆ అంచనాలకు భిన్నంగా కూటమి దూసుకుపోతోంది. 230 నుంచి 240 స్థానాల్ని కైవసం చేసుకునే
అవకాశం కనిపిస్తోంది. అంటే.. మ్యాజిక్‌ ఫిగర్‌ అయిన 272కు దరిదాపుల్లో ఆ కూటమి ఉంది. ఇలాంటి తరుణంలో.. నితీశ్‌ కుమార్‌ తిరిగి ఇండియా అలయన్స్‌లోకి వస్తే, కూటమి విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. కొన్ని రోజుల క్రితమే.. ఆర్జేడీ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ ఒక పెద్ద ప్రకటన చేశారు. తన పార్టీని కాపాడుకోవడం కోసం నితీశ్‌ కుమార్‌ ఏమైనా చేస్తారని, అందుకోసం జూన్‌ 4వ తేదీ తర్వాత ఎంత పెద్ద నిర్ణయమైనా తీసుకోవచ్చని కుండబద్దలు కొట్టారు. అంటే.. ఇండియా కూటమిలోకి ఆయన తిరిగి రావొచ్చని పరోక్ష సంకేతాలు ఇచ్చారు. అసలే ఇండియా కూటమి ఏర్పాటులో నితీశ్‌ కుమార్‌ అత్యంత కీలక పాత్ర పోషించారు కాబట్టి.. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఆయన కూటమిలోకి తిరిగొచ్చినా ఆశ్చర్యనపోనక్కర్లేదు. ఒకవేళ అదే జరిగితే మాత్రం.. ఎన్డీఏకు ఆయన గండి కొట్టినట్టే! అప్పుడు ఇండియా కూటమికే గెలుపవకాశాలు ఉంటాయి. కేవలం నితీశ్‌ కుమార్‌ రావడంతో ఇండియా కూటమికి ఆధిక్యం దక్కకపోవచ్చు. కానీ, ఆయన ఇచ్చే ట్విస్ట్‌కి ఇతర ప్రాంతీయ పార్టీలూ ఇండియా కూటమికి మద్దతు ఇవ్వొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ ఇండియా కూటమి 240 స్థానాల్లో నెగ్గి, అటు జనతాదళ్‌ (యూ) బిహార్‌లో 13`14 సీట్లు గెలిస్తే.. అప్పుడు ఇండియా కూటమి ఖాతాలోకి 253`254 సీట్లు వచ్చి చేరుతాయి. మరోవైపు.. బీజేపీ మ్యాజిక్‌ ఫిగర్‌కి అటుఇటుగా స్థానాల్ని కైవసం చేసుకోవచ్చు. కాబట్టి.. ఇండియా కూటమి గెలవాలంటే, ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతు కూడబెట్టుకోవాల్సి వస్తుంది. మరి.. ్గªనైల్‌ రిజల్ట్స్‌ ఎలా వస్తాయో చూడాలి.