బీహార్ లో రెచ్చిపోయిన మావోయిస్టులు

mmబీహార్ లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఔరంగాబాద్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరుపుతున్న సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకొని బాంబు పేల్చారు. దాంతో 10 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలొదిలారు. బాంబు పేలుడుతో పాటూ జవాన్లపై మావోయిస్టులు కాల్పులు కూడా జరిపారు. దాంతో జవాన్లు ఎదురుకాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించారు. ఈ కాల్పుల్లో పలువురు జవాన్లకు గాయాలయ్యాయి. ఆరుగురు మావోయిస్టులు కూడా గాయపడ్డట్లు సమాచారం. గాయపడ్డ జవాన్లను గయాలోని ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి సీఆర్పీఎఫ్ డీజీ వెళ్లనున్నారు.