బైకును ఢీకొన్న ఎమ్మెల్యే కారు

తీవ్రంగా గాయపడ్డ యువకులు
ఖమ్మం,ఆగస్ట్‌2(జ‌నంసాక్షి): ఎమ్మెల్యే రాములు నాయక్‌ కారు ఓ బైకును ఢీకొట్టింది. మంగళవారం ఉదయం ఖమ్మం జిల్లా, రఘునాధపాలెం మండలం, మంచుకొండ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. రాములు నాయక్‌ కారు బైకును ఢీకొట్టడంతో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం నుండి ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి కారేపల్లి వెళ్తున్న ఎమ్మెల్యే రాములు నాయక్‌ మంచుకొండ దగ్గర ఆయన కారు బైకును ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన యువకులను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎమ్మెల్యే దగ్గరుండి యువకులను ఆటోలో హాస్పిటల్‌ కి తరలించారు. యువకుల బైకుతో పాటు.. ఎమ్మెల్యే కారు కూడా దెబ్బతినడంతో రాములు నాయక్‌ మరో కారులో అక్కడి నుంచి బయలు దేరినట్లు తెలుస్తుంది. అయితే ఎమ్మెల్యే డ్రైవర్‌ అదుపు తప్పాడా.. లేక బైక్‌ నడుపుతున్న వ్యక్తి రాంగ్‌ రూట్‌ లో వచ్చాడా అనే అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.