బొగ్గు కుంభకోణంలో మన్మోహన్‌కు ఊరట

4

న్యూఢిల్లీ,ఏప్రిల్‌1(జనంసాక్షి):  బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌కు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. బొగ్గు కుంభకోణం కేసులో మన్మోహన్కు… సీబీఐ జారీ చేసిన సమస్లపై న్యాయస్థానం బుధవారం స్టే విధించింది.  ఈ మేరకు సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా బొగ్గు స్కాం కేసులో నిందితుడిగా విచారణకు హాజరు కావాలని సీబీఐ కోర్టు సమన్లు జారీచేయడాన్ని వ్యతిరేకిస్తూ  మన్మోహన్‌ సింగ్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించగా దీనిపై బుధవారం విచారణ జరిగింది. ఒడిశాలోని తలాబిరా-2 బొగ్గుబ్లాకును హిందాల్కోకు కేటాయించడంపై దాఖలైన కేసులో మన్మోహన్‌ను నిందితుడిగా కోర్టు పేర్కొంటూ ఏప్రిల్‌ 8న నిందితుడిగా విచారణకు హాజరుకావాలని సీబీఐ కోర్టు సమన్లు ఇచ్చింది. తనకు సమన్లు జారీ చేయడం సమంజసం కాదని మన్మోహన్‌ సుప్రీంను ఆశ్రయించారు. ఆయన తరపున కపిల్‌ సిబాల్‌ కేసు దాఖలు చేశారు. గతవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బొగ్గు కుంభకోణం కేసులో మన్మోహన్‌కు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.  సమన్లు జారీ చేయడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.