బోటు యజమానులకు సబ్సిడీ
శ్రీకాకుళం,నవంబర్29(జనంసాక్షి): ప్రతీ బోటు యజమానికి నెలకు రూ.1800 లను ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందిస్తుందని ఎంఎల్ఎ గుండ లక్ష్మీదేవి ప్రకటించారు. గురువారం ఉదయం శ్రీకాకుళంలోని గార మండలంలో ఎంఎల్ఎ గుండ లక్ష్మీదేవి చేతుల విూదుగా బోటు యజమానులకు డీజిల్ ఆయిల్ సబ్సిడీ పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎ మాట్లాడుతూ.. బోటు నడిపే మత్స్యకారులకు ప్రభుత్వం ప్రతీ బోటుకు నెలకు 300 లీటర్లు డీజిల్పై విూటరుకు ఆరు రూపాయల మూడు పైసలు సెల్టాక్స్ సబ్సిడీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ అభివృద్ధి అధికారి కవాగపట్నం పి.శాంతారావు, మత్స్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్.గోవిందరావు, రెండు మండలాల బోటు యజమానులు హాజరయ్యారు.