బోడును నూతన మండలంగా ప్రకటించాలి- సిపిఎం

టేకులపల్లి, జూలై 27( జనం సాక్షి ): బోడు కేంద్రం గా నూతన మండలం ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో టేకులపల్లి తహసీల్దార్ శ్రీనివాస్ కు వినతి పత్రం బుధవారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బోడు పరిసర గ్రామాల ప్రజలకు బోడును నూతనంగా మండల కేంద్రం ఏర్పాటు చేసి ప్రభుత్వ సేవలు అందుబాటులోకి తీసుకు రావాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన మండలాలను తెచ్చి పరిపాలన సౌలభ్యం కల్పించారని, అదేవిధంగా బోడు ను మండలం గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. బోడు పరిసర ఐదు గ్రామపంచాయతీల ప్రజలు ప్రభుత్వ పాలన సౌలభ్యం కోసం కోరుకుంటున్నాను .అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులు బోడును మండల కేంద్రంలో ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకొని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన కోరారు .ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్, మండల కార్యదర్శి ఈసం నరసింహారావు, మండల కమిటీ సభ్యులు కడుదుల వీరన్న,కుంజ రమేష్, ఈసం రామక్రిష్ణ,గొగ్గెల బాలక్రిష్ణ, చింత చిట్టి బాబు,మనోజ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.