బోథ్ పంచాయతీ సాధారణ సమావేశం

బోథ్ గ్రామపంచాయతీ సాధారణ సమావేశం  శనివారం సర్పంచ్ సురేందర్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశం లో త్రాగు నీటి సమస్య, సైడ్ డ్రైన్ నిర్మాణం, సిసి రోడ్డు ల నిర్మాణం పై చర్చించినట్లు సర్పంచ్ తెలిపారు. కొన్ని కాలనీ లో అత్యవసర సైడ్ డ్రైనేజి నిర్మానాలు చేయాలనీ వినతులు వస్తున్ననేపథ్యంలో ప్రభుత్వం నుంది కొన్ని నెలలుగా నిధులు రాకపోవడం తో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఆయా పనులను సాధ్యమైనంత త్వరగా చెపట్టాలని తీర్మానించామని పేర్కొన్నారు.
అనంతరం ప్రభత్వ హైస్కూల్ పిల్లతో కలసి పాలక వర్గం స్వచ్చ భారత్కార్యక్రమం కై అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఇందులో ప్రజలు మరుగుదొడ్లు కట్టుకొవాలని, పరిసరాలను పరిశుభ్రగా ఉంచుకోవాలని అవగాహనా కలిగించారు.
ఈ సమావేశం లో ఉప సర్పంచ్ కట్ట పల్లవి, సెక్రటరీ అంజయ్య, వార్డు సభ్యులు గంగయ్య, వెంకటేష్,గిరీష్, తుకారాం, వినయ్, లక్ష్మి,మచ్ఛేందర్, గొర్ల లక్ష్మి, రాజమణి, చిలుక లక్ష్మి,తస్లిమ్ బేగం, లు పాలుగోన్నారు.