బోథ్ లో రోడ్లకు 42.29 కోట్లు మంజూరు

బోథ్ నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో బీటీ రోడ్ల  నిర్మాణానికి రు. 42.29 కోట్లు మంజూరు అయ్యాయని  బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు  తెలిపారు. ఈ నిధుల ద్వారా సుమారు 93 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఈ నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కు మరియు అటవీశాఖ మంత్రి, ఇంద్రకరణ్ రెడ్డి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.