బోథ్ లో వికలాంగుల పాస్ ల కౌంటర్ ఏర్పాటు

 బోథ్ (జనంసాక్షి) బోథ్ మరియు పరిసర గ్రామాల వికలాంగుల సౌకర్యార్థం శనివారం 19 వ తేదీన స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో వికలాంగులకు బస్సు పాసులు జారీ కోసం ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో వారు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ బోథ్ కంట్రోలర్ సాయన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు.వికలాంగులు ఇట్టి అవకాశం ను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పాసు కావలసినవారు సదరన్ సర్టిఫికెట్ జిరాక్స్,ఆధార్ కార్డు జిరాక్స్ తోపాటు ఒక పాస్ ఫోటో, 50 రూపాయలు తీసుకొని రావాలని అన్నారు.