బోర్డు తిప్పేసిన జేమ్స్ స్కూల్
గుంటూరు,డిసెంబర్29(జనంసాక్షి): జేమ్స్ స్కూలు సంస్థ సీబీఎస్ఈ పేరుతో విద్యార్థుల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసి అనుమతి రాకపోవడంతో బోర్డు తిప్పేసింది. ఈ సంఘటన మంగళగిరి మండలం కాజా గ్రామంలో చోటు చేసుకుంది. గత మూడు నెలలుగా అనుమతి గురించి ప్రశ్నిస్తున్న తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి నేడు విద్యార్థులను గెంటివేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులను విద్యార్థులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.