బ్యాంక్  చోరికి గోడకు కన్నంవేసి చొరబాటు,బ్యాంక్  చోరికి గోడకు కన్నంవేసి చొరబాటు,

కాగజ్ నగర్ :చింతలమానేపల్లి మండలం:మండల కేంద్రములోని రవీంద్రనగర్  తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి విఫలయత్నం చెందారు. శుక్రవారం ఉదయం బ్యాంక్ ఉద్యోగులు మేనేజర్ ప్రతిరోజూలాగే తమ విధులకు హాజరయ్యారు,బ్యాంక్ గేట్లు తెరచి లోపలికి వెళ్లగానే గోడకు కన్నం ఉండడం, వస్తువులు చిందర వందరగా పడి ఉండటంతో ,అది చూసిన బ్యాంక్ ఉద్యోగులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చోరీకి ప్రయత్నించిన తీరు, అక్కడ పరిస్థితులను ఆరా తీశారు.గోడకు కన్నం వేసి నేరుగా బ్యాంక్ లోకి చొరబడ్డ నిందితులు లాకర్ ఓపెన్ చేసేందుకు గ్యాస్ కట్టర్ ను ఉపయోగించారని తెలిపారు, లాకర్ ఓపెన్ కాకపోవడంతో విఫలం చెంది బ్యాంక్ లో ఉన్న సీసీ కేమేరాలు, ఇతర వస్తువులు తీసుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయంలో జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ క్షుణ్ణంగా పరిశీలించి, కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. ఆయన వెంట డీఎస్పీ కరుణాకర్, బుద్దెస్వామీ, ఎస్సెలు విజయ్, రమేష్ తదితరులు ఉన్నారు,