భక్తకోటికి టిటిడి సంక్రాంతి శుభాకాంక్షలు

తిరుమల,జనవరి14(జ‌నంసాక్షి): భక్తకోటికి తిరుమల, తిరుపతి దేవస్థానం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పేరిట శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటన వెలువడింది. దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాల్లో రైతన్నలు కనుమ పండుగ పర్వదినాన గోపూజ చేసి గోసంరక్షణకు పాటుపడాలని ఈ సందర్భంగా ఈవో ఆకాంక్షించారు. దేవదేవుడైన శ్రీవేంకటేశ్వరస్వామివారి కృపాకాటాక్షాలతో పర్వదినాన్ని భక్తులందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలంటూ తిరుమల, తిరుపతి జేఈవోలు శ్రీనివాసరాజు, పోల భాస్కర్‌లు శుభాకాంక్షలు తెలిపారు.