భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలు
అశ్వరావుపేట, ఆగస్టు 5 ( జనం సాక్షి )
శ్రావణ మాస ప్రారంభం లో ఫస్ట్ శుక్రవారం నాడు తెలుగు ప్రజలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం ను ఆచరించారు. జిల్లా అశ్వరావుపేట మండలంలో ఇంటింటా మహిళలు ఉదయాన్నే స్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి దేవతను పట్టు వస్త్రాలతో అలంకరించి ఇష్టమైన వంటకాలు తయారుచేసి సమర్పించారు. మంత్ర సూక్తులతో భక్తులుఆలపించారు. పాడి పంటలు, ఆయురారోగ్యాలు, పిల్ల పాపలు సల్లంగా చూడాలని వరలక్ష్మి దేవతను కోరుకొని వ్రతాన్ని ఆచరించారు. వ్రతం అనంతరం వాయినాలు ఇచ్చు పుచ్చుకున్నారు.
