భద్రాచలంలో ఇద్దరు యువకుల మృతి

భద్రాచలం: శ్రీరామనవమి వేళ ఖమ్మం జిల్లా భద్రాచలంలో అపశ్రుతి చోటుచేసుకుంది. సీతారాముల దర్శనానికి వచ్చిన ఇద్దరు యువకులు గోదావరిలో మునిగి మృతిచెందారు. నదిలో స్నానానికి దిగిన యువకులు నీటిలో మునిగి చనిపోయారు. మృతులను విజయవాడకు చెందిన రాము(18), శివయ్య(18)గా గుర్తించారు.