భద్రాద్రి వరద బాధితుల సేవలో ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ కమిటీ…

బూర్గంపహాడ్ జూలై 31(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం లో ఇటీవల గోదావరి వరదలు కనీ వినీ ఎరుగని స్థాయిలో గ్రామాలను ముంచెత్తాయి. వరద ముంపుకు గురై సర్వం పోగొట్టుకున్న నిరాశ్రయులకు తమ వంతు సాయంగా ఖమ్మం పెవిలియన్ వాకర్స్ కమిటీ సభ్యులు వారి ధాతృత్వాన్ని చాటుకున్నారు. దాదాపు లక్షరూపాయల కు పైగా వివిధ వస్తువులు, చీరలు, ప్యాంట్స్, దుప్పట్లు, వంటపాత్రలు ఇతర సామాగ్రిని స్థానిక మండలం సారపక లోని చంద్రపుల్లారెడ్డి కాలనీ, బూర్గంపహాడ్ మండల కేంద్రం లోని రామాలయం రజక వీధి వారికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ కమిటీ సభ్యులు పిల్లి సుదర్శన్, రాకం శ్యామ్ బాబు, తాళ్లూరి వేణు, దామోదర్ రెడ్డి, నర్సింహారావు, హరి, మాటేటి రవి, వెంకట్ బాబు, హనుమంతు నల్లమోతు సురేష్ తో పాటు సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు మోరా రవి, సత్యనారాయణ, నాగేశ్వర రావు, పున్నమి చందు, తదితరులు పాల్గొన్నారు.