భర్త అంగాన్ని ఛేదన చేసిన మహిళ

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త

చెన్నై,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ఓ మహిళ తన భర్త అంగాన్ని కోసి ప్రయుడితో పాటు పారిపోయింది. అయితే పోలీసులు వారిని తక్కువ సమయంలోనే పట్టుకొని విచారణ చేపట్టారు. అనంతరం ఆ మహిళపై ఆమె ప్రియుడిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కల్లూరు జిల్లాకు చెందిన జయంతి (45) అనే మహిళకు పెల్ళై చాలా కాలమైంది. కాగా ఈ మధ్య ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం చనువుగా మారి, అది కాస్త వారి మధ్య ప్రేమగా మారింది. బుధవారం ప్రియుడితో కలిసి జయంతి మాట్లాడుతుండగా భర్త గమనించాడు. అనంతరం వారి మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో భర్త ధోవతి ఊడిపోయింది. జయంతి తన చేతిలో ఉన్న చిన్న ఆయుధంతో భర్తపై దాడి చేసింది. ఈ దాడిలో భర్త అంగంలో కొంత భాగం తెగిపోయిందని బాబు అనే వ్యక్తి విూడియాకు తెలిపారు.గ్రామస్థులు వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. కాగా భర్తపై దాడికి పాల్పడ్డ జయంతిపై విచారణ అనంతరం జైలుకు పంపించామని పోలీసులు తెలిపారు.