భాజపా మళ్లీ అధికారంలోకి రాకపోతే బుల్‌డోజర్లతో రామమందిరాన్ని కూలుస్తారేమో?


` మోదీకి అనుమానాలు
` ఇండియా కూటమి బలహీనతే మా బలం
` విజయం మాదే..హ్యాట్రిక్‌ సాధించబోతున్నాం
` యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ విమర్శలు
లక్నో(జనంసాక్షి):విపక్ష ఇండియా కూటమిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో అస్థిరతను సృష్టించేందుకు ఆ కూటమి ఎన్నికల బరిలో ఉందని మండిపడ్డారు.ఈ సందర్భంగా అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరం అంశాన్ని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్‌ సమాజ్‌వాదీ పార్టీ పై ఘాటు విమర్శలు చేశారు. వారు అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లను పంపిస్తారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ‘’శ్రీరామనవమి రోజున రామమందిరంపై ఎస్పీకి చెందిన ఓ సీనియర్‌ నేత అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అయోధ్యపై సుప్రీంతీర్పును మార్చాలని కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఈ రెండు పార్టీలకు కుటుంబం, అధికారమే ప్రథమ ప్రాధాన్యం. ఒకవేళ ఎస్పీ`కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వారు రామమందిరంపైకి బుల్డోజర్లను పంపి రామ్‌లల్లాను మళ్లీ టెంట్‌లోకి తీసుకొస్తారు’’ అని మోదీ దుయ్యబట్టారు.’’ఓ వైపు భాజపా`ఎన్డీయే కూటమి జాతి ప్రయోజనాలకు జీవితాలను అంకితం చేస్తే.. ఇండియా కూటమి మాత్రం దేశంలో అస్థిర పరిస్థితులను సృష్టించేందుకు పోటీపడుతోంది. ఈ ఎన్నికల తర్వాత వారి కూటమి పేకమేడలా కూలిపోతుంది. జూన్‌ 4 ఎంతో దూరంలో లేదు. ఈ ఎన్నికల్లో మోదీ సర్కారు హ్యాట్రిక్‌ కొట్టబోతోందని ప్రపంచమంతా తెలుసు’’ అని విజయంపై ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అమేఠీలో ఆయన పోటీ చేసే సాహసం చేయరని తాను ముందే ఊహించానని, ఇప్పుడు అదే నిజమైందని ఎద్దేవా చేశారు.రాయబరేలి ప్రజలు ప్రధానిని ఎన్నుకుంటారంటూ కాంగ్రెస్‌ నేత ఒకరు చెప్పడాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం ’హ్యాట్రిక్‌’ సాధించి తీరుతుందని అన్నారు.ప్రజలు అభివృద్దికి పట్టం కడతారని అన్నారు. ’ఇండియా’ కూటమి నేతలు ఒక్కొక్కరే జారుకుంటున్నారని అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ రాజకుమారుడు అఖిలేష్‌ యాదవ్‌ ఒక కొత్త ఆంటీ (మమతా బెనర్జీ) గొడుగు కింద చేరారు. ఆ కొత్త ఆంటీ పశ్చిమబెంగాల్‌లో ఉంది. విూకు బయట నుంచి మద్దతు ఇస్తామని ఆ కొత్త ఆంటీ ఇండియా కూటమికి చెబుతోందని మోదీ వ్యాఖ్యానించారు. దేశాన్ని మెరుగుపరచేందుకు బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ఒకవైపు, దేశంలో అస్థిరత సృష్టించేందుకు ఇండియా కూటమి ఒకవైపు ఉందని, ఎన్నికలు నడుస్తున్న కొద్దీ ఇండియా కూటమి నేతలు ఒక్కొక్కరే కూటమి నుంచి జారిపోరుతున్నారని చెప్పారు. కేంద్రంలో రాబోయే కొత్త ప్రభుత్వంలో పేదలు, యువకులు, మహిళలు, రైతుల కోసం ఎన్నో పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకోనున్నామని మోదీ చెప్పారు. జాతీయ ప్రయోజనాలకు బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే అంకితమైందని చెప్పారు. ఇండియా కూటమి నేతలు ప్రధానులవుతామంటూ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. తాను ’హ్యాట్రిక్‌’ కొట్టేందుకు, సమాజంలోని అన్నివర్గాల కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. 500 ఏళ్ల తర్వాత రామాలయం కల సాకారమైందంటే దానికి ప్రజల ఓటు బలమే అందుకు కారణమని అన్నారు. రామమందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తోసిరాజనేందుకు, మందిరంపై బుల్‌డోజర్‌ నడిపేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉన్నట్టు తమకు తెలిసిందని, న్యాయబద్ధంగా బుల్డోజర్‌ నడిపించడం ఎలాగో యోగి ఆదిత్యనాథ్‌ నుంచి కాంగ్రెస్‌ వాళ్లు తెలుసుకోవాలని సూచించారు. ఇండియా బ్లాక్‌కు ప్రజలు ఓటు వేసి అధికారం ఇస్తే, ఎస్సీ, ఎస్టీ, ఆదివాదీ, ఓబీసీల రిజర్వేషన్లను లాక్కొని తమ ఓటర్లకు ఇవ్వడం ద్వారా బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతుందని హెచ్చరించారు. ప్రధానమంత్రి యూపీలోని ఫతేపూర్‌, హవిూర్‌పూర్‌లోనూ శనివారంనాడు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు.