భారత ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 1న మహబూబ్ నగర్ రాక

భారత ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 1న మహబూబ్ నగర్ రాక

వనపర్తి బ్యూరో సెప్టెంబర్27 (జనంసాక్షి)భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 1న మహబూబ్ నగర్ విచ్చేస్తున్నారు ఈ సందర్భంగా పాలములో జరిగే భారీ బహిరంగ సభకు వనపర్తి పట్టణం నుంచి పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేయడం కోసం పట్టణ అధ్యక్షుడు బచ్చు రాము అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది సమావేశానికి ముఖ్యఅతిథిగా బిజెపి వనపర్తి నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్ ఏ సీతారాములు విచ్చేసి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభను పట్టణంలో 33 వార్డు నుండి 64 బూతుల నుండి పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించాలని సభా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని వర్గాల ప్రజలను జన సమీకరణ చేయాలని వారన్నారు నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే గొప్ప నాయకుడని అలాంటి నాయకుడు మన పాలమూరుకు వస్తున్న సందర్భంగా సభ విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు సీతారాములు బిజెపి జిల్లా కార్యదర్శులు బోయిల రామ్మోహన్ చిత్తారి ప్రభాకర్ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు అనుజ్ఞ రెడ్డి దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు కుమార్ బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బాబురావు బిజెపి నాయకులు ప్రవీణ్ బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ పెద్దపులి కిరణ్ రఘు నారాయణ పట్టణ ఉపాధ్యక్షులు రఘు మోహన్ సాగర్ విక్రమ్ రామ్ పట్టణ ప్రధాన కార్యదర్శి రాయన్న సాగర్ బి జె వై యం నాయకులు విజయ్ సాగర్ చుక్కసతీష్