భారీ అగ్నిప్రమాదం: పెద్ద ఎత్తున ఆస్తినష్టం


శ్రీకాకుళం,నవంబర్‌27(జ‌నంసాక్షి):ఎచ్చెర్ల మండలంలోని ధర్మవరంలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ధర్మవరం ఎస్సీకాలనీలోమంగళవారం ఉదయం అకస్మాత్తుగా భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో పదమూడు పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే నిరుపేద దళిత కుటుంబాలు కట్టుబట్టలతో నడిరోడ్డున పడ్డాయి. ప్రమాదానికి కారణం పూర్తిగా తెలియడం లేదు. విద్యుత్తు షార్టు సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని కొందరు భావిస్తున్నారు. ఘటనలో పదకొండు ఇళ్లు పూర్తిగా, రెండు ఇళ్లు పాక్షికంగా దగ్ధమయ్యాయి. సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో నడి రోడ్డునపడ్డ దళిత కుటుంబాల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.