భూహక్కుల కోసం గిరిజనుల ధర్నా
కరీంనగర్: తమకు అటవీ భూములపై హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు ఆందోళన బాటపట్టారు. ధర్మపురిలో గిరిజనులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ప్రభుత్వం తమకు అటవీ భూములపై హక్కులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తోన్నారు.