భూ తగాదాలతో వ్యక్తి పై దాడి

గరిడేపల్లి, జులై 21 (జనం సాక్షి): భూ  తగాదాలతో ఒక వ్యక్తి పై మరో వ్యక్తి దాడి చేసిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే                                           చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి చెందిన బత్తిని రమాదేవికి తన తల్లి గారి గ్రామం అయిన తాళ్లమల్కాపురంలో   కొంత భూమి ఉంది.  కాగా తనకు చెందిన భూమిలో నారు పోయడానికి రమాదేవి  రాగా తమ మధ్య ఉన్న భూ పంచాయతీలను మనసులో పెట్టుకొని  రమాదేవి సొంత చెల్లి భర్త అయిన చెరుకు రామకృష్ణ మరియు అతని భార్య చెరుకు ఈశ్వరమ్మ లు  మరికొంత మందితో  కలసి పధకం ప్రకారం వారిని చంపాలి అనే ఉద్దేశంతో చెరుకు రామకృష్ణ తన యొక్క ట్రాక్టర్ తో రమాదేవి భర్త బత్తిని కన్నయ్య ను  తొక్కించడంతో బత్తిని కన్నయ్య కుడి కాలు విరిగి ఛిద్రం అయినది. కన్నయ్య కుమారుడు బత్తిని హరీష్ ఫిర్యాదు మేరకు నేరస్థులపై హత్యాయత్నం కేస్ నమోదు చేసి ధర్యాప్తు చేయడం జరుగుతుందని యస్ ఐ కొండల్ రెడ్డి  తెలిపినారు.
 
Attachments area