భోగిమంటల్లో మోడీ చిత్రపటం దగ్ధం

తెలుగుయువత నిరసనలు

గుంటూరు,జనవరి14(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలో భోగి మంటలు వెలిగించారు. కాగా భోగి మంటలతో కేంద్రంపై తెలుగు యువత నిరసన వ్యక్తం చేసింది. భోగి మంటలతో పాటు ప్రధాని మోదీ దిష్టిబొమ్మ, చిత్ర పటాలను మంటల్లో దహనం చేశారు. ఏపీకి మోదీ చేసిన అన్యాయానికి నిరసనగా ఈ మేరకు నిరసన తెలిపారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రత్యేకమోదాను తుంగలో తొక్కారని మండిపడ్డారు.