మంచుదుప్పటి కప్పుకున్న కాశ్మీర్‌

శ్రీనగర్‌ : కాశ్మీర్‌ మంచుదుప్పటి కప్పుకుంది. కొండకోనలు, లోయలు మంచుతో మెరుస్తున్నాయి. హిమపు అందాలను చూసేందుకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున సందర్శకులు తరలివస్తున్నారు. మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నా పర్యాటకుల తాకిడి మాత్రం తగ్గడం లేదు. ఒంటినిండా వెచ్చని ఉన్ని వస్త్రాలు ధరించి ఇంటిల్లిపాది మంచుతో ఆడుకుంటున్నారు.