మండలాలను తనిఖీ చేసిన పంచాయతీ రాజ్ కమీషనర్

యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
పంచాయితీ రాజ్ కమిషనర్ యం.హనుమంత్ రావు బిబి నగర్ మండలం, యాదగిరిగుట్ట మండలాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా బీబీ నగర్ మండలం మహదేవ్ పూర్  గ్రామంలో  ఉపాధి హామీ పథకం పనులు , సీజనల్ వ్యాధుల పై తీసుకుంటున్న చర్యలు , హరితహరం మొక్కల పంపిణీ , పల్లె ప్రగతి పనులు, ఉపాధి హామీ పనుల 7 రిజిష్టర్ లను పరిశీలించి సక్రమంగా నిర్వహించడం లేదని  అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంబంధిత పంచాయితీ సెక్రటరికి షో కాజ్ నోటీస్ జారీ చేయవలసిందిగా డీపీవో  ను పంచాయితీ రాజ్ కమిషనర్ ఆదేశించారు.తదుపరి కమిషనర్ యాదగిరి గుట్ట మండలం వంగపల్లి గ్రామంలోని నర్శరిని , ఉపాధి హామీ పథకం పనులను, సీజనల్ వ్యాధుల పై తీసుకుంటున్న చర్యలు, 7 రిజిష్టర్ లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి గ్రామంలో హరితాహారం మొక్కల పంపిణీ పై ఇంటింటికీ తిరిగి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, జడ్పీ  సీఈఓ  కృష్ణ రెడ్డి, పీడీ  డి ఆర్ డి ఏ  యం.ఉపేందర్ రెడ్డి, డీపీవో  సున్నంద,  సంభందిత మండలాల ఎంపీడీఓ  లు, ఎం ఆర్ ఓ  లు , డివిజనల్ పి ఓ  లు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.