మండలాలను తనిఖీ చేసిన పంచాయతీ రాజ్ కమీషనర్
యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
పంచాయితీ రాజ్ కమిషనర్ యం.హనుమంత్ రావు బిబి నగర్ మండలం, యాదగిరిగుట్ట మండలాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా బీబీ నగర్ మండలం మహదేవ్ పూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులు , సీజనల్ వ్యాధుల పై తీసుకుంటున్న చర్యలు , హరితహరం మొక్కల పంపిణీ , పల్లె ప్రగతి పనులు, ఉపాధి హామీ పనుల 7 రిజిష్టర్ లను పరిశీలించి సక్రమంగా నిర్వహించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంబంధిత పంచాయితీ సెక్రటరికి షో కాజ్ నోటీస్ జారీ చేయవలసిందిగా డీపీవో ను పంచాయితీ రాజ్ కమిషనర్ ఆదేశించారు.తదుపరి కమిషనర్ యాదగిరి గుట్ట మండలం వంగపల్లి గ్రామంలోని నర్శరిని , ఉపాధి హామీ పథకం పనులను, సీజనల్ వ్యాధుల పై తీసుకుంటున్న చర్యలు, 7 రిజిష్టర్ లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి గ్రామంలో హరితాహారం మొక్కల పంపిణీ పై ఇంటింటికీ తిరిగి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, జడ్పీ సీఈఓ కృష్ణ రెడ్డి, పీడీ డి ఆర్ డి ఏ యం.ఉపేందర్ రెడ్డి, డీపీవో సున్నంద, సంభందిత మండలాల ఎంపీడీఓ లు, ఎం ఆర్ ఓ లు , డివిజనల్ పి ఓ లు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.