మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

రాయికోడ్ లో జాతీయ సమాఖ్య రక్షాబంధన్ సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జాతీయ సమాఖ్య రక్షాబంధన్ సంధర్బంగా వేడుక‌లు ఘ‌నంగా నిర్వహించారు. మండల అధికారులకు, ప్రజాప్రతినిధులకు మరియు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మండల ఎంపీపీ మమత అశోక్ మరియు మండల ఎంపిఓ అంజనీ దేవి రాఖీలు క‌ట్టి, మిఠాయిలు తినిపించారు. ఈ. కార్యక్రమంలోో జడ్పిటిసి మల్లికార్జున్ పటేల్ ఆత్మ కమిటీ చైర్మన్ చేవెళ్ల విట్టల్ మండల పార్టీ అధ్యక్షులు బసవరాజ్ పటేల్. ఎమ్మార్వో రాజయ్య ఎంపీడీవో వెంకటేశం ఎస్సై ఏడుకొండలు సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణ ఏపీ ఓ గురుపాదం ఈసీ విష్ణువర్ధన్ టి ఏ లు పంచాయతీ కార్యదర్శిలు సద్దాం బాబురావు రమేష్ శంకర్ . విిఠల్ తదితరులు పాల్గొన్నారు.