మంత్రికి సన్మానం

చిత్తూరు,నవంబర్‌27(జ‌నంసాక్షి):పలమనేరులోని కార్యాలయంలో పరిశ్రమల శాఖా మంత్రి అమరనాథ రెడ్డిని నియోజకవర్గ సంఘమిత్రల సంఘం నాయకులు మంగళవారం ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలమనేరు నియోజకవర్గ సంఘమిత్రల సంఘం నాయకులు మాట్లాడుతూ.. సంఘమిత్రలకు గౌరవ వేతనం అమలు చేసినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపామన్నారు. అనంతరం మార్కెట్‌ యార్డు వద్ద ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.