మంత్రిని సన్మానించిన కార్పొరేటర్ హరిశంకర్ రెడ్డి

– జనంసాక్షి
విదేశీ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకొని స్వరాష్ట్రానికి చేరుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిని పీర్జాదిగూడ 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. శంషాబాద్ విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు.