మంత్రి కొప్పుల ఈశ్వర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మున్నూరు కాపు సంఘం..

ధర్మపురి (జనం సాక్షి) ధర్మపురి పట్టణ మున్నూరు కాపు సంఘం నూతన అధ్యక్షుడు చీపిరి శెట్టి రాజేష్ వారితో ఎన్నికైన సభ్యులు సోమవారం ఉదయం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను మర్యాదపూర్వకంగా కలిసి వారికి శ్రీ లక్ష్మీనరసింహస్వామి చిత్రపటం అందించి శాల తో సత్కరించి సన్మానించారు. తదనంతరం మంత్రి నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు చీపిరి శెట్టి రాజేష్, ప్రధాన కార్యదర్శి బండారి లక్ష్మణ్,ఆర్థిక కార్యదర్శి కాశేట్టి రాంబాబు,ఉపాధ్యక్షులు సోమిశెట్టి శివ సాయి,స్తంభంకాడి మహేష్,సంయుక్త కార్యదర్శులు ఒడ్నల భూమేష్, పానుగంటి రవి,కార్యదర్శులు చుక్క రవి,చల్ల రవి,చుక్క భీమ్ రాజ్, బండారి తిరుపతి,కార్యవర్గ సభ్యులు సోమిశెట్టి శేఖర్,కాశేట్టి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.