మంత్రి మహేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన మహిళా నేతలు

మంత్రి మహేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన మహిళా నేతలు

తాండూరు సెప్టెంబర్ 23(జనంసాక్షి) రాష్ట్ర సమాచార గనులు భూగర్భ శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి జన్మదినాన్ని పురస్కరించు కొని తాండూరు పట్టణానికి చెందిన మహిళ నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.శనివారం హైదరాబాద్ నగరంలోని మంత్రి మహేందర్ రెడ్డి నివాసంలో తాండూరుకు చెందిన మహిళా నేతలు మంత్రి మహేందర్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందజేసే శాలువాతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు అదేవిధంగా మరెన్నో ఉత్తమ పదవులు చేపట్టాలని మనస్పూర్తిగా భగవంతుని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, కౌన్సిలర్లు శోభారాణి,నీరజ బాల్రెడ్డి, మాజీ కౌన్సిలర్ పరిమళ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.