మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటనను విజయవంతం చేయాలి:- ఎమ్మెల్యే రవీంద్ర కుమార్

దేవరకొండ సెప్టెంబరు 26 (జనం సాక్షి )

ఈనెల 29న దేవరకొండ నియోజకవర్గంలో జరిగే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటనను విజయవంతం చేయాలని దేవరకొండ శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు ప్రారభోత్సవం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆనంతరం గిరిజన భవనంలో సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో SC ,ST కమిషన్ సభ్యులు నేనావత్ రాంబాబు నాయక్,జడ్పీటిసి కేతవత్ బాలు,జడ్పీటీసీ సలహాదారులు మారుపాకుల సురేష్ గౌడ్,పసునూరి యుగేందర్ రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ పాల్గొన్నారు