మంత్రి సమక్షంలో టిడిపిలో చేరిక

కడప,నవంబర్‌28(జనంసాక్షి): మంత్రి ఆదినారాయణరెడ్డి సమక్షంలో పలువురు టిడిపిలో చేరారు. యర్రగుంట్ల మున్సిపాలిటీలోని 5 వ వార్డు క్రాంతి నగర్‌లోని యాదవ సామాజిక వర్గానికి చెందిన 40 మంది బుధవారం ఉదయం దేవగుడి గ్రామానికి వచ్చి మంత్రి సమక్షంలో టిడిపిలో చేరారు. మంత్రి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టిడిపి లోకి చేరినవారు మాట్లాడుతూ… టిడిపి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను, మంత్రి ఆదినారాయణరెడ్డి నియోజక వర్గానికి చేసిన అభివృద్ధిని చూసి పార్టీలో చేరినట్లు చెప్పారు. భవిష్యత్‌లో టిడిపి చేపట్టే అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటామని పేర్కొన్నారు. టిడిపిలో చేరిన వారిలో గంగన్న, ఎన్‌.రామదాసు, ఎమ్‌.సుబ్బరామ్‌, ఎన్‌.రామ ప్రసాద్‌, సి.గోపాల క్రిష్ణ, జె.శ్రీధర్‌, ఎన్‌.రామ మోహన్‌ లు, మిగిలినవారు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కమలాపురం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జె.చెన్న క్రిష్ణారెడ్డి, యర్రగుంట్ల 20 వ వార్డు కౌన్సిలర్‌ ఎస్‌.మహమ్మద్‌ గౌస్‌ లు పాల్గొన్నారు.