మంత్రి సోమిరెడ్డికి షాక్‌!

– వైసీపీలో చేరిన రామకోట సుబ్బారెడ్డి
– తెర వెనుక మంత్రాంగం నడిపిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి
ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి షాక్‌ తగిలింది.. సోమిరెడ్డి సొంత బావ రామకోట సుబ్బారెడ్డి వైసీపీలో చేరాడు. బుధవారం వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను కలిసి వైఎస్సార్‌సీపీలో చేరారు. సుబ్బారెడ్డికి జగన్‌ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. సుబ్బారెడ్డితో పాటూ ఆయన ఇద్దరు కుమారులు శిధర్‌రెడ్డి, కళాధర్‌రెడ్డి కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సుబ్బారెడ్డి సోమిరెడ్డి
చంద్రమోహన్‌ రెడ్డి సోదరి భర్త. కొద్ది రోజులుగా సుబ్బారెడ్డికి సోమిరెడ్డితో ఆస్తి వివాదం నడుస్తోందని నెల్లూరు జిల్లాలో చర్చ జరుగుతోంది. జిల్లాకు చెందిన కొందరు టీడీపీ నేతల తీరు కూడా నచ్చకపోవడంతో సుబ్బారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి మంత్రాంగం నడిపారు. సంక్రాంతి సమయంలో ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. వైసీపీలోకి రావాలని ఆహ్వానించి అండగా ఉంటామని హావిూ ఇవ్వడంతో వైసీపీలో చేరాలని నిర్ణయించారు. ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో చేరికలు కూడా ఊపందుకుంటున్నాయి. ప్రధాన పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలు పక్క చూపులు చూస్తున్నారు. టికెట్‌, పదవుల హావిూతో పక్క పార్టీల్లో చేరిపోతున్నారు. రెండు మూడు నెలలుగా ఈ చేరికలు ముమ్మరమయ్యాయి. ఈ రెండు రోజుల వ్యవధిలోనూ నేతలు అటూ ఇటూ మారిపోయారు.