మంత్రి హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపిన ఆత్మకమిటీ చైర్మన్ గుండ రంగారెడ్డి

 జగదేవ్ పూర్, జూలై  21జనం సాక్షి: సిద్దిపేట జిల్లా ములుగు డివిజన్ ఆత్మకమిటీ చైర్మన్ గా  తనను నియమించినందుకు రాష్ట్ర  ఆర్థిక శాఖ మంత్రి టి. హరీష్ రావుకు చైర్మన్ గుండా రంగారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.  గురువారం హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో  ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గజ్వేల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్ మున్సిపల్ చైర్మెన్ నేతి చిన్న రాజమౌళిలతో పాటు నియోజకవర్గ నాయకులతో కలిసి వెళ్లి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ  వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించి మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
కార్యక్రమంలో  ఎంపీపీ అధ్యక్షులు   దాసరి  అమరావతి, మెరుగు బాలేశం గౌడ్  పాండు గౌడ్, జడ్పీటీసీలు పంగ మల్లేశం, రాంచంద్రం, పార్టీ అధ్యక్షులు బెండే మధు, నూనె కుమార్, నాగరాజు, కర్ణాకర్ రెడ్డి,పనగట్ల శ్రీనివాస్,దేవి రవీందర్,కోలా సద్గుణ,కవిత శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు సర్పంచులు పార్టీ నాయకులు పాల్గొన్నారు: