మద్దూరు తహశీల్దార్ భూపతికి సన్మానం

మద్దూరు (జనంసాక్షి) అక్టోబర్ 17 : సిద్దిపేట జిల్లా మద్దూరు మండల నూతన తహశీల్దార్ గా పదవి బాధ్యతలు చేపట్టిన భూపతిని సోమవారం టీఆర్ఎస్ విద్యార్థి,యువజన విభాగం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో మద్దూరు మండల టీఆర్ఎస్వీ అధ్యక్షులు పోతుగంటి రవీందర్ గౌడ్, యువజన విభాగం మద్దూరు మండల అధ్యక్షులు గూడా రవీందర్ రెడ్డి, సోషల్ మీడియా అధ్యక్షులు మాచర్ల రఘు, సోషల్ మీడియా ఉపాధ్యక్షులు తౌటి రాజు తదితరులు పాల్గొన్నారు.