మద్యం దుకాణాలపై ఎక్సైజ్‌ దాడులు

ఏలూరు,జనవరి24(జ‌నంసాక్షి): పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలపై ఎక్సైజ్‌ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఆ శాఖ జిల్లా ఉప కమిషనర్‌ వైవీ.భాస్కరరావు ఆదేశాల మేరకు అధికారులు 17 బృందాలుగా విడిపోయి దాడులు చేశారు. మద్యం గొలుసు దుకాణాలు నిర్వహిస్తూ విడి మద్యం అమ్ముతున్న, నాటు సారా విక్రయిస్తున్న 12 మందిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో 85 మద్యం సీసాలు, 15 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.