మధ్యాహ్న భోజన బియ్యం సరఫరా లో తీవ్ర జాప్యం

 గంగారం నవంబర్ 17 (జనం సాక్షి) గంగారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలకు రావాల్సిన మధ్యాహ్న భోజన బియ్యం ఇంతవరకు పాఠశాలలకు అందలేదని పాఠశాలలోని పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టాలంటే సరైన సమయంలో పాఠశాలకు బియ్యం సరఫరా చేయాలని ఈ విషయంలో మండలంలో తీవ్ర జాప్యం జరుగుతుందని పై అధికారులకు చెప్పినా ఫలితం మాత్రం ఉండట్లేదని ఇది కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్న సమస్య, గంగారం మండలంలో రవాణా వ్యవస్థ అంతంత మాత్రమే కొంతమంది టీచర్లకు మధ్యాహ్న భోజన బియ్యం తీసుకెళ్లడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డి,టి, ఎఫ్ మండల అధ్యక్షులు ముడిగే రామచందర్ వివరించారు ఇప్పటికైనా సిఆర్పి గిరిబాబు త్వరితగతిన మధ్యాహ్న భోజన బియ్యాన్ని సంబంధిత సెంటర్కు పంపించాలని డిమాండ్ చేశారు