మనీషా కొయిరాలాకు క్యాన్సర్‌ పలువురు దిగ్భ్రాంతి

ముంబై, నవంబర్‌ 29 : ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ మనీషా కొయిరాలాకు క్యాన్సర్‌ వ్యాధి సోకినట్టు తెలిసింది. ఆమె ప్రసుత్తం జస్లోక్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. మనీషావెంట ప్రస్తుతం ఆమె తల్లి సుష్మ ఉన్నారు. మనీషాకు క్యాన్సర్‌ సోకిందన్న వార్తతో ఆమె కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. ఆమె తండ్రి, సోదరుడు హుటాహుటిన ముంబయికి బయలుదేరి వస్తున్నారు. ఇటీవల ఆమె నేపాల్‌ వెళ్లినప్పుడు అచేతన స్థితికి లోనయ్యారని, దీంతో ముంబైలోని జాస్లోక్‌ ఆసుపత్రిలో వైద్యపరిక్షలు చేయించుకున్నారు. ఈ పరిక్షల్లో ఆమెకు క్యాన్సర్‌ ఉన్నట్లు తేలిందని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని రోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితి బాగోలేదని మనీష కొయిరాలా సన్నిహితులు అంటున్నారు. వైద్యులు ఆమెకు పలు రకాల టెస్టులు నిర్వహించారని, టెస్టు రిపోర్టులు వచ్చిన తర్వాత అంతా షాకయ్యారని, జాస్లోక్‌ ఆసుపత్రిలోనే ఆమె క్యాన్సర్‌ వ్యాధికి చికిత్స తీసుకోవాలని నిర్ణయించుకుందని వెల్లడించారు.

నేపాల్‌కు చెందిన మనీషా కొయిరాలా 1991లో ‘సౌదాగర్‌’ అనే చిత్రం ద్వారా భారతీయ సినీ రంగంలోకి అడుగు పెట్టింది. తన అందచందాలు, నటనా నైపుణ్యంతో ఆనతికాలంలోనే టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ మనీషా కొయిరాలకు అవకాశాలు వెల్లువెత్తాయి. వయసు పైబడ్డాక సినిమా అవకాశాలు తగ్గడంతో నేపాల్‌ చెందిన వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుని అతనితో పొసగక విడిపోయింది. కెరీర్‌ సరిగా లేకపోవడం, వ్యక్తిగత సమస్యలతో ఆమె బాగా ఇటీవల కృంగిపోయారని తెలుస్తోంది. దక్షిణాదిన క్రిమినల్‌ సినిమాలో ఆమె నటన పలువురిని విశేషంగా ఆకర్షించింది. మనీషా చివరిసారిగా నటించిన సినిమా ఇటీవల రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చి