మన దర్శకునికి సీమాంధ్రుల బెదిరింపు కాల్స్‌

జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన ఎన్‌ శంకర్‌
హైదరాబాద్‌, అక్టోబర్‌ 20 (జనంసాక్షి):
తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విదంగా చిత్రించిన కెమెరామెన్‌ గంగతో రాంబాబు సినిమాపై అభ్యతరం వ్యక్తం చేసిన జైబోలో తెలంగాణ దర్శకుడు ఎన్‌.శంకర్‌కు సిని హీరో పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల నుంచి శంకర్‌ సెల్‌ఫోన్‌కు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి. దీనిపై ఆయన శనివారం బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని కించ పరిచే విధంగా కెమెరామెన్‌ గంగతో రాంబాబు సినిమాపై తెలంగాణ ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే మీడియా ముందుకు వచ్చి కెమెరామెన్‌ గంగతో రాంబాబు సినిమాలో అభ్యతర సన్ని వేశాలున్నాయని వాటిని సినిమాలో నుండి తొలగించాలని చెప్టడంతో అది సహించలేని పవన్‌ కళ్యాన్‌ అభిమానులు శంకర్‌కు బెదిరింపు కాల్స్‌, మెసెజ్‌లు పెడుతున్నారు. అయితే బెదిరింపు కాల్స్‌, మెసెజ్‌లు ఆపకపోతే సీమాంధ్ర హీరోల సినిమాలు ఒక్కటి కూడా తెలంగాణలోని పది జిల్లాలలో ఎక్కడ కూడా నడవనివ్వమని ఉస్మానియ యూనిర్శిటీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ పవన్‌కళ్యాణ్‌ అభిమాను హెచ్చరించింది. శంకర్‌కు బెదిరింపు కాల్స్‌ రావటంపై తెలంగాణ వాదులు మండిపడ్డారు.